
సినిమాలు

నటి సమంత నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మా ఇంటి బంగారం చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉంది. జూన్ 19న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఆమె భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఒకే రోజులో దాదాపు 40 టీవీ, సోషల్ మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు సమాచారం. ఈ స్థాయి ప్రమోషన్ డ్రైవ్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్లు పూర్తి చేసిన సమంత ఇప్పుడు తమిళనాడులో ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనుంది. చెన్నైలో కూడా ఆమె సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే సీఎం విజయ్ను సమంత కలవబోతుందనే వార్తలు కూడా హాట్ టాపిక్గా మారాయి. గతంలో విజయ్తో సమంత నటించిన సినిమాలకు మంచి స్పందన రావడంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యం లభిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!