

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ “వారణాసి ” టైటిల్ గ్లింప్స్ శనివారం హైదరాబాద్లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలన స్పందన రాబట్టింది. అయితే విజువల్స్ కంటే ఎక్కువగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది రాజమౌళి చేసిన భారీ ప్రకటన. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు, తర్వాత IMAXకు మార్పిడి చేయబడగా, వారణాసి మాత్రం నేరుగా IMAX ఫార్మాట్లోనే షూట్ అవుతున్న తొలి భారతీయ చిత్రం అని రాజమౌళి ప్రకటించారు. 1.43:1 రేషియోలో షూట్ అవ్వడం వల్ల, ఇది ఒప్పెన్హైమర్ లాంటి హాలీవుడ్ విజువల్స్ స్థాయిలో కనిపిస్తుందని చెప్పవచ్చు.
కానీ ఇక్కడే పెద్ద సమస్య ఉంది భారతదేశంలో ఒక్క 1.43 IMAX స్క్రీన్ కూడా లేదన్నది నిజం! ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో IMAX స్క్రీన్లు ఉన్నా, అవి నిజమైన 1.43 ఫార్మాట్ కావు. హైదరాబాద్లోని ప్రసాద్ IMAX కూడా ఇప్పుడు PCX అనుభవం మాత్రమే ఇస్తుంది. అంటే, రాజమౌళి చెప్పిన ఆ భారీ విజువల్ అనుభవం ప్రస్తుతం భారతదేశంలో ఎక్కడా సాధ్యం కాదు.
అయితే, వారణాసి 2027 లేదా 2028 ఆరంభంలో విడుదలయ్యే అవకాశం ఉన్నందున, అప్పటికి కనీసం ఒక 1.43 IMAX స్క్రీన్ భారత్లో ఏర్పాటవుతుందని రాజమౌళి, IMAX సంస్థలకూ నమ్మకం ఉంది. IMAX కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ కూడా “వారణాసి విడుదలయ్యే సమయానికి హైదరాబాద్లో IMAX పూర్తి సదుపాయాలు ఉంటాయి” అని తెలిపారు. నిజంగా ఆ స్క్రీన్ వారణాసితోనే ప్రారంభమైతే, తెలుగు సినీ ప్రేక్షకుల కోసం ఇది ఎన్నడూ చూడని చారిత్రాత్మక అనుభవం అవుతుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!