

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన స్టైలిష్ యాక్షన్ డ్రామా ఓజి థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమై, ఓటీటీలో కూడా మంచి స్పందన పొందిన తర్వాత ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ అవతార్, యాక్షన్ సన్నివేశాలు, అలాగే ఎస్. థమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర శాటిలైట్ హక్కులను ఈటీవీ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హీరోయిన్గా ప్రియాంక మోహన్ నటించగా, విలన్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ ఆకట్టుకున్నారు. యాక్షన్తో పాటు భావోద్వేగాలను కలగలిపిన ఈ చిత్రం బుల్లితెరపై కూడా మంచి టీఆర్పీ సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే టీవీ ప్రీమియర్ తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!