

మలయాళ చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోగా మోహన్ లాల్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన నట వారసులుగా కొడుకు, కూతురు కూడా వెండితెరపై అడుగుపెట్టారు. గత ఏడాది ప్రణవ్ మోహన్ లాల్ ‘డీయస్ ఈరే’ అనే హారర్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ ఏడాది విస్మయ మోహన్ లాల్ యాక్షన్ కథాంశంతో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. ఆమె నటించిన ‘తుడక్కం’ చిత్రానికి జూడే ఆంథని జోసెఫ్ దర్శకత్వం వహించారు. యాక్షన్, సర్వైవల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన తర్వాత కేరళతో పాటు విదేశీ మార్కెట్లలోనూ మంచి వసూళ్లు సాధిస్తున్నట్లు వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. తొలి సినిమాతోనే విస్మయకు వచ్చిన స్పందన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
‘తుడక్కం’ కేరళ వసూళ్లలో వేగంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. కేవలం 6 రోజుల్లో కేరళ నుంచి రూ. 15 కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం. మరోవైపు విదేశీ మార్కెట్ల నుంచి కూడా సుమారు రూ. 15 కోట్ల గ్రాస్ వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో మొత్తం 6 రోజుల్లోనే రూ. 30 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మోహన్ లాల్ కూతురు తొలి సినిమాకే ఈ స్థాయి వసూళ్లు రావడం విశేషంగా మారింది. రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక ప్రదర్శనలో సినిమా ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఈ విజయం విస్మయ కెరీర్కు మంచి ఆరంభంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!