

తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఎమ్మెస్ రాజు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించడంతో పాటు పలువురు ప్రతిభావంతులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన నిర్మించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎమ్మెస్ రాజు నిర్మించిన ‘పౌర్ణమి’ చిత్రానికి కూడా ప్రభుదేవానే దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, అప్పట్లో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన ఎమ్మెస్ రాజు, ప్రభుదేవాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తన సినీ ప్రయాణంలో ఏ దర్శకుడు, హీరో, హీరోయిన్ లేదా సాంకేతిక నిపుణుడితోనూ వివాదాలు ఎదురుకాలేదని తెలిపారు. షూటింగ్ ప్రదేశంలో ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించిన ‘అగధ’ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!