

సినిమా రిలీజ్కు ముందు హీరోలు, నటులు తమ సినిమాలపై నమ్మకం చూపిస్తూ పాజిటివ్గా మాట్లాడటం సహజమే. కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్పినా పర్వాలేదు. కానీ అత్యుత్సాహంతో ఇచ్చిన పెద్ద స్టేట్మెంట్లు చాలా సార్లు తిరగదడతాయి. ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాలన్న ఉద్దేశంతో చెప్పిన మాటలు, సినిమా ఫలితం అనుకున్నట్టుగా రాకపోతే ట్రోలింగ్కు కారణమవుతాయి. ఇటీవల సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు దీనికి ఉదాహరణగా మారాయి. “ఈ సినిమా చూసి ప్రేక్షకులు షాక్ కాకపోతే, నేను ఇండస్ట్రీని వదిలేస్తా” అని ఆయన చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ మెటీరియల్గా మారింది.
రాజేంద్ర ప్రసాద్ చెప్పిన ‘షాక్’ పాజిటివ్ అర్థంలో ఉండొచ్చు, కానీ ప్రేక్షకులు మాత్రం మరో విధంగా షాక్ అయ్యారు. ఈ రోజుల్లో ఇంత రొటీన్ సినిమా తీసి ఇలా ప్రమోట్ చేయడం ఎందుకని ఆలోచిస్తున్నారు. ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి ఇబ్బంది పడినవారు ఒక్కరే కాదు. గతంలో విశ్వక్సేన్, తన ‘పాగల్’ సినిమా గురించి “థియేటర్లు తిరిగి తెరుస్తుంది” అని చెప్పాడు, కానీ సినిమా ఫ్లాప్ అయింది. అలాగే ప్రియదర్శి, ‘మిత్రమండలి’ సినిమా కోసం “ఇది నచ్చకపోతే నా సినిమాలు చూడొద్దు” అని ఛాలెంజ్ విసరగా, ఆ సినిమా డిజాస్టర్ అయింది.
కానీ అన్ని సార్లు నెగటివ్ కాదు — ‘కోర్టు’ సినిమా విషయంలో నాని చేసిన పెద్ద స్టేట్మెంట్ మాత్రం నిజమైంది, సినిమా హిట్ అయింది. అందుకే సినీ ప్రముఖులు హైప్ కోసం పెద్ద మాటలు మాట్లాడే ముందు, ఫలితం గురించి ఆలోచించడం మంచిది. లేదంటే ప్రేక్షకులే ఆ మాటలను తిరిగి వారిపైనే వాడుకుంటారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (1)
That’s funny but true