

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. ఈ భారీ అంచనాల మధ్య రూపొందుతున్న సినిమా వచ్చే నెల 30 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మంచి స్పందన పొందుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే దాదాపు రూ. 200 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు సుమారు రూ. 40 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఒక తెలుగు సినిమాకు జరిగిన అత్యుత్తమ డీల్స్లో ఇది ఒకటిగా నిలిచింది. విదేశాల్లో లాభాల్లోకి రావాలంటే సుమారు 9 మిలియన్ డాలర్ల వసూళ్లు అవసరమని అంచనా.
ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ పాట హిట్ కాగా, ‘రై రై రా రా’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 1980ల గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే శివ రాజ్కుమార్, జగపతి బాబు, బొమ్మన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!