

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది, ఎందుకంటే వారి సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. నటుడు మహేష్ బాబు ప్రస్తుతం తన సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇప్పుడు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో కలిసి ‘వారణాసి’ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించడానికి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.
ఇదే సమయంలో మహేష్ బాబు నిర్మాతగా మారబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత ఆయన తన సొంత నిర్మాణంలో ఒక భారీ చిత్రాన్ని చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఆ సినిమాని ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ సినిమాలో ఆయన ఒక సూపర్ మాన్ గెటప్ లో మనకు కనిపించబోతున్నారట. ఇక ఎప్పటినుంచో మహేష్ బాబు ఆ పాత్రను చేయాలని అనుకుంటున్నాప్పటికి ఆయనకు ఇప్పటివరకు వీలుపడలేదు. ఇక ఎలాగూ వారణాసి సినిమాతో ఆయనకు హాలీవుడ్ మార్కెట్లో మంచి పట్టు దొరుకుతుంది. కాబట్టి తనే ప్రొడ్యూసర్ గా మారి సినిమాను చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక దానికి నమ్రత సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
ప్రస్తుతం మహేష్ బాబు సినిమా షూటింగ్ లో పాల్గొంటుంటే నమ్రత ఆ ప్రొడక్షన్ కి సంబంధించిన గ్రౌండ్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తుంది...ఇక మహేష్ బాబు ఎందుకని అంత రిస్క్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అతను ఓకే అంటే చాలామంది ప్రొడ్యూసర్లు అతని సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వస్తారు కదా ఆయనే ప్రొడ్యూసర్ గా మారడం ఎందుకు అనే డౌట్ ప్రతి ఒకరికి రావచ్చు. కానీ మహేష్ బాబు పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన హాలీవుడ్ మార్కెట్ పూర్తిగా పెరిగిపోతుంది. అప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి రెమ్యూనరేషన్ రూపంలో డబ్బులు తీసుకునే కంటే తనే ఓన్ గా ప్రొడ్యూస్ చేసి వచ్చిన లాభం మొత్తాన్ని తనే తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారట. అయితే ఈ నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!