
ఓటీటీ

సినీ పరిశ్రమలో థియేటర్లకు సంబంధించిన సమస్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పెద్ద సినిమాల విడుదల విధానం, సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితిపై ఎగ్జిబిటర్ల సంఘం కీలక చర్చలు జరపనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు చిరంజీవితో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
పెద్ద సినిమాలను శాతం విధానంలోనే విడుదల చేయాలని ఎగ్జిబిటర్ల సంఘం కోరనుంది. అలాగే అద్దె విధానం కారణంగా థియేటర్ యజమానులు ఎదుర్కొంటున్న నష్టాలను కూడా చిరంజీవికి వివరించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఆర్థిక పరిస్థితి గురించి సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!