
జనరల్

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారంటూ ఒక నకిలీ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది. ఈ లేఖను నిజమని నమ్మి పలువురు పంచుకోవడంతో గందరగోళం నెలకొంది. ఈ విషయంపై పీబీఐ ఫ్యాక్ట్ చెక్ టీం స్పందిస్తూ ఆ లేఖ పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారనే వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ తప్పుడు ప్రచారమేనని పేర్కొంది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!