

శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న “శివం మార్గ్” ప్రాజెక్టులో సాలు మండపాల నిర్మాణానికి సంబంధించిన టెండర్లపై దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్లో భాగంగానే సాలు మండపాల నిర్మాణం ప్రతిపాదించామని తెలిపారు. రాతి నిర్మాణాలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు టెండర్ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుందని, నిబంధనల ప్రకారం ముందుగానే టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
అయితే టెండర్పై తుది నిర్ణయం ఈ నెల 28న జరిగే ధర్మకర్తల మండలి సమావేశంలోనే తీసుకుంటామని ఈఓ స్పష్టం చేశారు. సభ్యులు స్వేచ్ఛగా చర్చించి తీసుకునే నిర్ణయం ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. చైర్మన్ లేదా సభ్యులు వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించడం సరికాదని, ఎలాంటి ఒత్తిళ్లు లేదా వ్యక్తిగత ప్రయోజనాలు లేవని దేవస్థానం పేర్కొంది. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయని ఈఓ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!