
ఓటీటీ

పోలవరం ప్రాజెక్ట్లో కేంద్ర మట్టి, పదార్థాల పరిశోధనా సంస్థ (సీఎస్ఎంఆర్ఎస్) బృందం బుధవారం రెండో రోజు పరీక్షలు నిర్వహించింది. ఈ పరిశీలనలు గురువారం కూడా కొనసాగనున్నాయి.
సీఎస్ఎంఆర్ఎస్కు చెందిన నిపుణులు సిద్ధార్థ్ పీ హెడవూ, శ్రీ హరి టి నాయర్, గౌరవ్ పాండే గ్యాప్ 2 ప్రాంతంలో 14 పరీక్షలు నిర్వహించారు. మట్టిలో తేమ శాతం, పటుత్వం, అలాగే నిర్మాణంలో ఉపయోగించే రాయి, మట్టి నాణ్యతను పరిశీలించారు. ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణంలో ప్రతి పొర సమయంలో పరీక్షలు చేయడం అవసరమని శాస్త్రవేత్తలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!