
రాజకీయాలు

కేరళలోని తిరువనంతపురం ప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో బంగారం, వజ్రాల ఆభరణాలు అదృశ్యమైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని కేరళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వెల్లడించడంతో ఆలయ భద్రతపై భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సుమారు 78 గ్రాముల విలువైన ఆభరణాలు కనిపించకుండా పోయినట్లు నివేదికలో పేర్కొన్నారు.
అందులో వైరమ్ నామంగా పిలువబడే వజ్రాల ఆభరణం కూడా ఉందని సమాచారం. మరమ్మతుల కోసం తీసుకెళ్లిన కొన్ని వస్తువులు తిరిగి ఆలయానికి రాలేదని అధికారులు తెలిపారు. భద్రతా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని, అన్ని విలువైన వస్తువులను సురక్షిత ఖజానాల్లో భద్రపరచాలని డీజీపీ సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!