

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో నిర్వహించిన నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరసనలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులను బలవంతంగా క్షమాపణ చెప్పించాలని ఒత్తిడి తెచ్చి, అనంతరం వారి కుటుంబాలను బెదిరిస్తున్నారని ఆయన విమర్శించారు. నిరసన సందర్భంగా వేధింపులకు గురైన ఐదుగురు విద్యార్థులను నిన్న రాహుల్ గాంధీ కలిసి వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, విద్యార్థులు ఎలాంటి తప్పు చేయలేదని, వారు ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. మరోవైపు, నీట్ నిరసనలో విద్యార్థులపై పోలీసుల చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే అయోధ్య విరాళాల వ్యవహారం, జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా అంశాలపై చర్చించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!