
జనరల్

తెలంగాణ మంత్రి కొండా సురేఖ బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు, ఇటీవల చోటుచేసుకున్న వివాదాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. సుమారు గంటపాటు ఈ సమావేశం కొనసాగినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని మరికొద్ది గంటల్లో హైదరాబాద్కు చేరుకోనున్న సమయంలోనే కొండా సురేఖ, ఖర్గే భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సమావేశంలో ఏ అంశాలపై చర్చించారనే దానిపై అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు. దీంతో తెలంగాణ కాంగ్రెస్లో ఈ భేటీపై చర్చ జరుగుతోంది. ఖర్గేతో సురేఖ సమావేశం పార్టీకి సంబంధించి కీలక పరిణామాలకు సంకేతమా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!