Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శ్రీకాకుళంలో తొలి AI ఆక్వా పార్క్ ఏర్పాటు

09:16 PM, 17 నవంబర్, 2025
శ్రీకాకుళంలో తొలి AI ఆక్వా పార్క్ ఏర్పాటు

అంధ్రములో అత్యంత వెనుకబడ్డ జిల్లాల్లో ఒకటిగా భావించబడే శ్రీకాకుళం ఇప్పుడు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కింగ్స్ ఇన్‌ఫ్రా వెంచర్స్‌తో కలిసి భారతదేశంలో తొలిసారిగా AI ఆధారిత సముద్ర ఆక్వాకల్చర్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటు చేసేందుకు ₹2,500 కోట్ల పెట్టుబడితో ఒప్పందం కుదుర్చుకుంది. 500 ఎకరాల్లో నిర్మించబడనున్న ఈ మెగా పార్క్ శ్రీకాకుళంను ఆధునిక ఆక్వాకల్చర్‌లో గ్లోబల్ మ్యాప్‌లో నిలబెడుతుంది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా 1,500 ప్రత్యక్ష ఉద్యోగాలు, 10,000 పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. మత్స్యకారులు అధికంగా ఉన్న ఉత్తరాంధ్ర యువతకు ఇది భారీ ఉపాధి అవకాశాలను అందిస్తుంది. పార్క్ ప్రారంభం తర్వాత ₹2,000 కోట్ల నేరుగా ఎగుమతులు, ₹20,000 కోట్ల పరోక్ష ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. అదనంగా, ఆక్వాకల్చర్ స్కిల్ & ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా ఐదేళ్లలో 5,000 స్థానిక యువతకు శిక్షణ, సర్టిఫికేషన్ లభిస్తుంది. భారతదేశంలో ఇదే తొలి AI ఆధారిత ఆక్వా పార్క్‌ కావడం ప్రత్యేకత. ఇందులో రొయ్యలు, చేపల బ్రిడింగ్ యూనిట్లు, ఇండోర్ వాటర్-ఫార్మింగ్ షెడ్లు, ట్యాంక్ ఆధారిత గ్రోవింగ్ సిస్టమ్స్, ఆధునిక ప్రాసెసింగ్ సెంటర్లు, సీఫుడ్ లాబ్, అన్ని కార్యకలాపాలను నియంత్రించే AI ఆధారిత స్మార్ట్ కంట్రోల్ రూమ్ ఉంటాయి. బ్లూటెక్‌OS ఆధారంగా ఈ వ్యవస్థ విజాగ్‌ నుండి నిర్వహించబడుతుంది.

ఇప్పటికే ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌కు భూమిని త్వరగా గుర్తించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది.
ఏప్రిల్ 2025లో సీఎం చంద్రబాబు ప్రకటించిన మత్స్యకార సేవ పథకంలో భాగంగా ఆక్వా పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని కేవలం ఆరు నెలల్లోనే నెరవేర్చినట్టైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రొఫెసర్ నాగేశ్వర్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

ప్రొఫెసర్ నాగేశ్వర్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

పర్యాటక అభివృద్ధికి బిహార్ కొత్త ప్లాన్‌.. ఉద్యోగులకు టూర్లు తప్పనిసరి

పర్యాటక అభివృద్ధికి బిహార్ కొత్త ప్లాన్‌.. ఉద్యోగులకు టూర్లు తప్పనిసరి

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..

డ్రగ్స్ కేసులో సింగర్ అరెస్ట్.. కారులో భారీగా హెరాయిన్ స్వాధీనం

డ్రగ్స్ కేసులో సింగర్ అరెస్ట్.. కారులో భారీగా హెరాయిన్ స్వాధీనం

అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు ఇరాన్ ప్రకటింపు

అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు ఇరాన్ ప్రకటింపు

తెలంగాణలో ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు

తెలంగాణలో ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు

ట్యాగ్లు
శ్రీకాకుళంAI ఆక్వా పార్క్కింగ్స్ ఇన్‌ఫ్రాఆంధ్రప్రదేశ్ వార్తలుచంద్రబాబుఆక్వాకల్చర్ టెక్నాలజీఉత్తరాంధ్ర అభివృద్ధిస్కిల్ డెవలప్మెంట్పెట్టుబడులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రొఫెసర్ నాగేశ్వర్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
జనరల్

ప్రొఫెసర్ నాగేశ్వర్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

ఏఐలో భారత్ ముందంజ వేయాలంటే నైపుణ్యాలే కీలకం: ఐబీఎం ఇండియా చీఫ్ సందీప్ పటేల్
టెక్నాలజీ

ఏఐలో భారత్ ముందంజ వేయాలంటే నైపుణ్యాలే కీలకం: ఐబీఎం ఇండియా చీఫ్ సందీప్ పటేల్

పర్యాటక అభివృద్ధికి బిహార్ కొత్త ప్లాన్‌.. ఉద్యోగులకు టూర్లు తప్పనిసరి
జనరల్

పర్యాటక అభివృద్ధికి బిహార్ కొత్త ప్లాన్‌.. ఉద్యోగులకు టూర్లు తప్పనిసరి

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..
జనరల్

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..

ఆర్సీబీ-గుజరాత్ మ్యాచ్‌కు వర్షం ముప్పు...
క్రీడలు

ఆర్సీబీ-గుజరాత్ మ్యాచ్‌కు వర్షం ముప్పు...

డ్రగ్స్ కేసులో సింగర్ అరెస్ట్.. కారులో భారీగా హెరాయిన్ స్వాధీనం
జనరల్

డ్రగ్స్ కేసులో సింగర్ అరెస్ట్.. కారులో భారీగా హెరాయిన్ స్వాధీనం

స్టార్ హీరో నుంచి బైక్ మెకానిక్‌గా.. అబ్బాస్ జీవితంలో ఊహించని మలుపు
సినిమాలు

స్టార్ హీరో నుంచి బైక్ మెకానిక్‌గా.. అబ్బాస్ జీవితంలో ఊహించని మలుపు

బ్యాంకింగ్ రంగంలో ఏఐ హవా..
టెక్నాలజీ

బ్యాంకింగ్ రంగంలో ఏఐ హవా..

చాముండేశ్వరి ఆలయానికి రణ్‌వీర్ సింగ్‌
సినిమాలు

చాముండేశ్వరి ఆలయానికి రణ్‌వీర్ సింగ్‌

అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు ఇరాన్ ప్రకటింపు
జనరల్

అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు ఇరాన్ ప్రకటింపు

మానవ శ్రమను పూర్తిగా మార్చేసే స్థాయికి AI చేరొచ్చు: క్రిస్టోఫ్ ఒలాహ్
టెక్నాలజీ

మానవ శ్రమను పూర్తిగా మార్చేసే స్థాయికి AI చేరొచ్చు: క్రిస్టోఫ్ ఒలాహ్

అమెరికా, చైనాకు పోటీగా భారత్‌ సావరిన్ AI- డెల్ వైస్ ప్రెసిడెంట్‌ సతీష్ అయ్యర్
టెక్నాలజీ

అమెరికా, చైనాకు పోటీగా భారత్‌ సావరిన్ AI- డెల్ వైస్ ప్రెసిడెంట్‌ సతీష్ అయ్యర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!