

మాజీ స్పీకర్, వైఎస్సార్సీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం కుటుంబంపై నమోదైన ఫోర్జరీ కేసు విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టాన్ని అనుసరించి లా అండ్ ఆర్డర్ నిర్వహించాల్సిన బాధ్యత పోలీసులదేనని, తమకు నచ్చిన విధంగా వ్యవహరించడం సరికాదని స్పష్టం చేసింది. కేసుల్లో సాక్షుల వాంగ్మూలాలను మార్చడం, తప్పుడు కేసులు నమోదు చేయడం వంటి ఆరోపణలు ఆందోళనకరమని కోర్టు వ్యాఖ్యానించింది. వివాదాస్పద రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కుమారుడి పేరుపై ఉంటే, తమ్మినేని సీతారాం, ఆయన భార్యను నిందితులుగా ఎందుకు చేర్చారని పోలీసులను ప్రశ్నించింది.
ఈ కేసులో పోలీసులు, ఫిర్యాదుదారుడు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. అయితే తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులకు అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. అరెస్ట్ భయం ఉంటే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఫోర్జరీ ఆరోపణలపై ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, ఆస్తి కొనుగోలుకు సంబంధించిన చెల్లింపుల ఆధారాలను సమర్పించాలని కూడా కోర్టు పేర్కొంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!