
క్రీడలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే కొద్ది గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట్, గద్వాల, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్! జారీ చేశారు.
ఇప్పటికే హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వేసవి వేడి నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. తాజా హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, ఈదురు గాలుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!