
జనరల్

తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా గారు తన సతీమణితో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి ఘాట్లో పవిత్ర పుష్కర స్నానం చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి నదీ తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ గారు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పుష్కరాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!