
జనరల్

ముంబై సినీ నటి జిత్వానీకి సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ విజయవాడ సీఐడీ కోర్టులో ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో వైసీపీ నేత విద్యాసాగర్ను వ్యక్తిగత సాన్నిహిత్య సమయంలో తీసిన ఫోటోలతో జిత్వానీ బెదిరించినట్లు పేర్కొంది. తన పరువును కాపాడుకోవడానికి పలుమార్లు డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని విద్యాసాగర్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐడీ వెల్లడించింది.
దర్యాప్తులో భాగంగా విద్యాసాగర్ మొత్తం రూ.1.32 కోట్లను జిత్వానీ, ఆమె తల్లి ఉమ్మడి బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు సీఐడీ గుర్తించినట్టు ఛార్జ్షీట్లో పేర్కొంది. ఈ ఆర్థిక లావాదేవీలను దర్యాప్తులో కీలక ఆధారాలుగా నమోదు చేసినట్లు తెలిపింది. కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండగా, దర్యాప్తు సంస్థ సమర్పించిన ఆధారాల ఆధారంగా తదుపరి న్యాయపరమైన ప్రక్రియ కొనసాగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!