
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం నేడు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో జరగనుంది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధి, సీఆర్డీఏకు సంబంధించిన పలు కీలక అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. మోతడక గ్రామంలో ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ నిర్మాణం కోసం 2,340 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించే ప్రతిపాదనపై చర్చించనుంది.
అమరావతిలో 9 మెగావాట్ల డేటా సెంటర్ నిర్మాణం, 20 ప్రాంతాల్లో 5జీ సెల్ టవర్ల ఏర్పాటు, లండన్ ఐ తరహా ప్రాజెక్టుకు టెండర్ల పిలుపు, రోప్వే ప్రాజెక్టుకు కన్సల్టెన్సీ ఎంపిక వంటి అంశాలకు క్యాబినెట్ ఆమోదం ఇవ్వనుంది. అలాగే క్వాంటం వ్యాలీలో రూ.1,205 కోట్లతో రెండు 18 అంతస్తుల టవర్ల నిర్మాణానికి ఎల్అండ్టీకి పనులు అప్పగించేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది. ఈ నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా చర్చించే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!