

భారత స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని పాజిటివ్గా ప్రారంభించింది. అంతర్జాతీయంగా కనిపించిన సానుకూల సంకేతాలు సూచీలకు బలాన్నిచ్చాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతుండటంతో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ పెరుగుదల దిశలో కదులుతున్నాయి.
ఈ వారం విడుదల కానున్న అమెరికా ఆర్థిక డేటాపై మదుపర్లు దృష్టి పెట్టారు. ఆ డేటా ఆధారంగా డిసెంబర్లో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో విదేశీ మార్కెట్లలో కనిపించిన బలమైన ట్రెండ్లు భారత మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి.
గత సెషన్ ముగింపు 84,562 పాయింట్లతో పోలిస్తే సోమవారం మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు లాభపడ్డది.
ఉదయం 9:45 గంటల సమయానికి, సెన్సెక్స్ 254 పాయింట్ల లాభంతో 84,817 వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీ కూడా అదే దిశలో పయనిస్తూ 58 పాయింట్ల లాభంతో 25,967 వద్ద ట్రేడవుతోంది.
హీరో మోటోకార్ప్
మారికో
కనరా బ్యాంక్
వోల్టాస్
బ్యాంక్ ఆఫ్ బరోడా
గ్లెన్మార్క్
ఆస్ట్రాల్ లిమిటెడ్
పీజీ ఎలక్ట్రోప్లాస్ట్
సుప్రీమ్ ఇండస్ట్రీస్
ఫియోనిక్స్ మిల్స్
నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ 345 పాయింట్ల లాభంలో, బ్యాంక్ నిఫ్టీ 367 పాయింట్ల లాభంలో ఉంది.
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹88.72గా నమోదైంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!