

సందీప్ పటేల్, ఐబీఎంఇండియా చీఫ్, కృత్రిమ మేధ (AI) రంగంలో భారత్ అగ్రగామిగా నిలవాలంటే ప్రభుత్వం, కంపెనీలు, విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. AI విస్తరణకు అనుగుణంగా ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు నేర్పించడం అత్యవసరమని పేర్కొన్నారు. ఐటీ సంస్థలు ఉద్యోగులకు రీ-స్కిల్లింగ్పై దృష్టి పెట్టాలని కూడా సూచించారు.
AI భారత్కు సవాల్ కాదని, కానీ లక్షలాది ఉద్యోగాలను కాపాడుకోవడమే అసలు సవాల్ అని సందీప్ పటేల్ వ్యాఖ్యానించారు. దేశ జనాభాలో సగానికి పైగా 30 ఏళ్లలోపు వారే ఉండటం భారత్కు పెద్ద బలమని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద AI శ్రామిక శక్తిని నిర్మించే అవకాశం భారత్కు ఉందని పేర్కొన్నారు. అయితే AI వేగానికి తగ్గట్టుగా నైపుణ్యాలు పెంచుకోకపోతే ఈ జనాభా ప్రయోజనం తగ్గిపోతుందని హెచ్చరించారు. ప్రస్తుతం జనరేటివ్ AI కోడింగ్, డేటా విశ్లేషణ, ఎంట్రీ లెవెల్ పనులను వేగంగా పూర్తి చేస్తుండటంతో ఐటీ రంగంలో ఉద్యోగాల స్వరూపం మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!