

ఐపీఎల్ 2026లో తన అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్న 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం అతడిని సెలెక్టర్లు ఎంపిక చేయగా, ప్రస్తుతం ఇండియా ఏ జట్టులో ట్రై నేషన్ సిరీస్లో ఆడుతున్నాడు. తన అరంగేట్ర మ్యాచ్లో 14 పరుగులు మాత్రమే చేసినా, భవిష్యత్తులో పెద్ద ఇన్నింగ్స్లు ఆడతాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో అతని చిన్ననాటి స్నేహితుడు అయాన్ రాజ్ బీహార్ అండర్ 16 జిల్లా లీగ్లో సంచలనం సృష్టించాడు. ముజఫర్పూర్లో సంస్కృతి క్లబ్ తరఫున ఆడుతూ 83 బంతుల్లో 210 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 35 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండగా, జట్టు 30 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 464 పరుగులు చేసింది.
అయాన్ రాజ్ గతంలో కూడా 327 పరుగుల ట్రిపుల్ సెంచరీతో వార్తల్లో నిలిచాడు. చిన్న వయసులోనే ఇద్దరు స్నేహితులు ఇలాంటి అద్భుత ప్రదర్శనలు చేస్తుండటంతో, భవిష్యత్తులో వీరు భారత క్రికెట్కు పెద్ద ఆస్తిగా మారతారని నిపుణులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!