

ఐపీఎల్ 2026లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ, సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన వాగ్వాదం తర్వాత ఆన్లైన్లో తీవ్ర చర్చ జరిగింది. మ్యాచ్ అనంతరం కోహ్లీ.. ట్రావిస్ హెడ్తో షేక్హ్యాండ్ చేసేందుకు ఆసక్తి చూపలేదన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ఘటన తర్వాత భారత క్రికెట్ అభిమానుల నుంచి తాను, తన కుటుంబం తీవ్ర ఆన్లైన్ వేధింపులు ఎదుర్కొంటున్నామని ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా హెడ్ ఆస్ట్రేలియన్ మీడియాతో వెల్లడించారు.
2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, 2024 బాక్సింగ్ డే టెస్ట్ల తర్వాత కూడా ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయని ఆమె తెలిపారు. తమ చిన్న కుమార్తెపై కూడా బెదిరింపు సందేశాలు వచ్చినట్లు ఆరోపించారు. క్రీడల్లో భావోద్వేగాలు సహజమే అయినప్పటికీ, ఆటగాళ్లు మరియు వారి కుటుంబాలు కూడా నిజమైన మనుషులేనని అభిమానులు గుర్తుంచుకోవాలని జెస్సికా సూచించారు. సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!