
క్రీడలు

ఐపీఎల్ 2026 చివరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ను 40 పరుగుల తేడాతో ఓడించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 60 పరుగులతో మెరవగా, కెప్టెన్ అక్షర్ పటేల్ 39 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో డేవిడ్ మిల్లర్, అశుతోష్ శర్మ వేగంగా పరుగులు జోడించడంతో ఢిల్లీ 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

204 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్కతా కెప్టెన్ అజింక్య రహానే 63 పరుగులతో పోరాడినా సరైన సహకారం లభించలేదు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో మ్యాచ్ను ఢిల్లీ వైపు తిప్పగా, ఎంగిడి కూడా మూడు వికెట్లు తీసి కోల్కతా బ్యాటింగ్ను కుదేలు చేశాడు. కీలక సమయంలో పావెల్ రనౌట్ కావడంతో కోల్కతా ఆశలు చిగురించకముందే కూలిపోయాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!