

‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు వడ్డే నవీన్ తన కెరీర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ‘మనసిచ్చి చూడు’ చిత్రం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా ఒక రీమేక్ అని, ఆ కారణంగా తొలుత ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తి చూపలేదని తెలిపారు. కథను మొదట ఎడిటర్ మోహన్ వినిపించినప్పటికీ, రీమేక్ కావడంతో కొంత సందేహం వ్యక్తం చేసినట్లు చెప్పారు.
అనంతరం ఎడిటర్ మోహన్ ప్రత్యేకంగా రూపొందించిన స్క్రీన్ప్లేను వినిపించగా అది ఎంతో నచ్చి సినిమా చేయడానికి అంగీకరించినట్లు వెల్లడించారు. అలాగే చిత్రంలో ముందుగా రికార్డ్ చేసిన ఒక పాటను తొలగించి, ఆ స్థానంలో ఉత్సాహభరితమైన ‘సలాం మలేకుమ్’ పాటను చేర్చినట్లు తెలిపారు. రాశి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సుహాసిని, రవితేజ కీలక పాత్రలు పోషించగా, మణిశర్మ సంగీతం అందించారు. ఆర్. సురేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!