

ప్రస్తుతం సినీ ప్రపంచంలో స్పెషల్ సాంగ్స్కు ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది. ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్గా పిలిచే ఈ పాటలు ఇప్పుడు సినిమాల ప్రధాన ఆకర్షణగా మారాయి. భారీ సెట్లు, మాస్ బీట్స్, గ్లామరస్ ప్రెజెంటేషన్తో ఈ పాటలు ప్రేక్షకులను థియేటర్లలో ఉత్సాహపరుస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు ఈ పాటల్లో కనిపిస్తే సినిమాపై క్రేజ్ మరింత పెరుగుతోంది. కథలో చిన్న భాగమే అయినా, సరైన స్పెషల్ సాంగ్ సినిమా విజయానికి కీలకంగా మారుతోందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
శృతి హాసన్, తమన్నా భాటియా, సమంత, పూజా హెగ్డే వంటి నటీమణులు ఈ ట్రెండ్కు మరింత ఊపునిచ్చారు. ‘ఆగడు’లో శృతి హాసన్ చేసిన మాస్ సాంగ్, ‘జైలర్’లో తమన్నా చేసిన ‘కావాలయ్యా’, అలాగే ‘ఊ అంటావా మావా’ పాటతో సమంత అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యింది. ప్రస్తుతం యంగ్ హీరోయిన్లు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తూ స్పెషల్ సాంగ్స్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పాటలు సినిమాల ప్రమోషన్లో కీలక పాత్ర పోషిస్తూ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!