

ప్రకటన రోజు నుంచే దర్శకుడు మోహన్.జి తెరకెక్కిస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా ద్రౌపది 2 పై ప్రేక్షకుల్లోనే కాకుండా సినీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. 14వ శతాబ్దం దక్షిణ భారతదేశపు నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో బహుభాషా సినిమాగా తీర్చిదిద్దారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికేట్ను పొందింది. రిచర్డ్ రిషి లుక్, అద్భుతమైన విజువల్స్, పాటలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచగా, చిరాగ్ జానీ విలన్గా నటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఈ సందర్భంగా దర్శకుడు మోహన్.జి మాట్లాడుతూ, మహమ్మద్ బిన్ తుగ్లక్ పాత్రలో చిరాగ్ జానీ అద్భుతంగా నటించారని ప్రశంసించారు. ఈ పాత్రను కేవలం విలన్గా కాకుండా, తన నిర్ణయాల వల్ల సమస్యల్లో చిక్కుకునే పాలకుడిగా చూపించామని తెలిపారు. రిచర్డ్ రిషి హీరోగా, రక్షణ ఇందుసుదన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నట్టి నటరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. నేతాజీ ప్రొడక్షన్స్, జి.ఎం. ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఫిలిప్ ఆర్. సుందర్ సినిమాటోగ్రఫీ అందించగా, గిబ్రాన్ సంగీతం సమకూర్చారు. త్వరలో ట్రైలర్ విడుదల చేసి, ఆడియో లాంచ్ నిర్వహించనున్న మేకర్స్, ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్కు సిద్ధమవుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!