

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై నిర్మాతలు టి.జి. విశ్వ ప్రసాద్ మరియు కృతి ప్రసాద్ భారీ స్థాయిలో, అన్కాంప్రమైజ్డ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్తో నిర్మించారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం మొత్తం పాల్గొని సినిమాపై విశేషాలను పంచుకుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, హారర్, కామెడీ, రొమాన్స్, యాక్షన్, భావోద్వేగాల సమ్మేళనంగా ‘రాజా సాబ్’ ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందిస్తుందని తెలిపారు. అన్ని ప్రాంతాల్లోనూ సినిమాకు మంచి బజ్ ఏర్పడిందని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు మరియు ఉత్తర భారత్ లో స్పందన బలంగా ఉందని వెల్లడించారు. మొదటి రోజు గ్లోబల్గా భారీ వసూళ్లు వచ్చే నమ్మకం ఉందని కూడా పేర్కొన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ, సినిమా చూసిన ప్రేక్షకులు గుండెల నిండా ఆనందంతో థియేటర్ నుంచి బయటకు వస్తారని హామీ ఇచ్చారు. గ్రాండ్ మేకింగ్, కొత్త ప్రపంచం, శక్తివంతమైన నేపథ్య సంగీతంతో ‘రాజా సాబ్’ ఈ సంక్రాంతికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేసింది. జనవరి 9 న వరల్డ్వైడ్ విడుదలకు సిద్ధమైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభావం చూపనుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!