
సినిమాలు

భారత్, ఇరాన్లోని చాబహార్ పోర్టులో తనకున్న వాటాను విక్రయించే యోచనలో ఉన్నట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మధ్య ఆసియా దేశాలు మరియు రష్యాతో వాణిజ్యానికి ఈ పోర్టును భారత్ అభివృద్ధి చేస్తోంది. అమెరికా ఆంక్షల సడలింపులపై అనిశ్చితి నెలకొనడంతో ఈ నిర్ణయంపై చర్చలు జరుగుతున్నాయి.
కొన్ని ప్రతిపాదనల ప్రకారం, పోర్టు నిర్వహణను తాత్కాలికంగా ఇరాన్ సంస్థకు అప్పగించే అంశాన్ని భారత్ పరిశీలిస్తోంది. ఆంక్షలు సడలిన తర్వాత తిరిగి నిర్వహణను స్వీకరించే అవకాశం ఉందని సమాచారం. చాబహార్ పోర్టు ప్రాజెక్టులో భారత్ దాదాపు 120 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఈ పోర్టు ఆఫ్ఘనిస్తాన్ కు మానవతా సహాయం అందించడంలో కీలకంగా ఉంది. అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు.



.webp&w=3840&q=75)




.webp&w=3840&q=75)



_0.jpg.webp&w=3840&q=75)






.jpg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!