

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కొత్తమురుముళ్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆక్వా రైతు దాట్ల రామకృష్ణరాజు (68)ను ఆయన చెరువు వద్ద పనిచేస్తున్న కూలీలు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. చెరువు పనులకు సంబంధించిన వివాదం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో కూలీలు బండరాయితో దాడి చేసి హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అనంతరం అదే రాయిని మృతదేహానికి కట్టి చెరువులో పడేసినట్లు సమాచారం.
ఒడిశాకు చెందిన నలుగురు కూలీలు చెరువు వద్దే నివసిస్తూ కాపలా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని పోలీసులు తెలిపారు. గంజాయి మత్తులో ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఘటన అనంతరం పరారయ్యేందుకు ప్రయత్నించిన నిందితులను కాకినాడ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై రవీంద్రబాబు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!