2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..

Writer: Chandrika 09:54 AM, 2 సెప్టెంబర్, 2026
నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..

నేపాల్‌కు మరోసారి భారీ వరద ముప్పు పొంచి ఉంది. దేశంలోని తూర్పు, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో నదుల నీటిమట్టాలు, ప్రవాహాలు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నువాకోట్‌, రసువా జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని జాతీయ విపత్తు ముప్పు తగ్గింపు, నిర్వహణ అథారిటీ హెచ్చరించింది. పలు చిన్న నదుల్లో నీటిమట్టాలు పెరుగుతున్నట్లు తెలిపింది. టపుల్‌జంగ్‌, సుంఖువసభ, సోలుకుంభ్‌, ఖోటంగ్‌, ఓఖ్లదుంగా, రామెఛాప్‌, డోలఖ, సింధుపాల్‌చౌక్‌, కావ్రేపాలంచోక్‌, లలిత్‌పుర్‌, భక్తపుర్‌, కాఠ్‌మాండూ, ధాడింగ్‌ తదితర జిల్లాలకు కూడా వరద ముప్పు ఉందని అధికారులు వెల్లడించారు. కోశీ, నారాయణి, బాగ్‌మతి, కర్నాలి, మహాకాలి నదులతోపాటు వాటి ఉపనదుల ప్రవాహాలను పర్యవేక్షిస్తున్నారు. రసువాలోని తైమూర్‌లో నదీ ప్రవాహాన్ని నేరుగా గమనించేందుకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వరద పరిస్థితిపై నేపాల్‌ ఇంధనశాఖ మంత్రి బీరజ్‌ భక్త శ్రేష్ఠ వాతావరణ నిపుణులతో సమీక్ష నిర్వహించారు.

నేపాల్‌లో ఇప్పటికే సంభవించిన విపత్తు భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చింది. మంగళవారం నాటికి 1,050 మంది మరణించగా, మరో 4,000 మంది ఆచూకీ తెలియడం లేదని సమాచారం. గల్లంతైన వారిలో 583 మంది విదేశీయులు ఉన్నారు. సహాయక బృందాలు ఇప్పటివరకు 12,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వర్షాలు, నదుల ఉద్ధృతి కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. జలవిద్యుత్తు ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారత్‌, చైనాకు చెందిన నిపుణులు కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 280 మందిని సొరంగాల నుంచి రక్షించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, వాతావరణ మార్పులకు కారణమవుతున్న అధిక గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలు చేస్తున్న దేశాల నుంచి పరిహారం కోరాలని నేపాల్‌ నిర్ణయించింది. ఇది దాతృత్వం కాదని, బాధ్యతగా అందించాల్సిన న్యాయపరమైన పరిహారమని నేపాల్‌ పేర్కొంది. హిమాలయాల్లో మంచు వేగంగా కరుగుతున్న నేపథ్యంలో గంగా, త్రిశూలి వంటి నదులపై ఆధారపడే దక్షిణాసియా ప్రజలకు భవిష్యత్తులో తీవ్ర ముప్పు ఉంటుందని ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసింది. విపత్తు సమయంలో భారత్‌ అందించిన సాయాన్ని నేపాల్‌ బిలియనీర్‌ బినోద్‌ చౌధరి ప్రశంసించారు. 2015 భూకంప సమయంలో భారత్‌ అందించిన సహాయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొండచరియలు, వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

కొండచరియలు, వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు

ట్యాగ్లు
నేపాల్‌ వరదలునేపాల్‌ విపత్తుఆకస్మిక వరద హెచ్చరికనేపాల్‌ నదులువరద ముప్పువాతావరణ మార్పులుహిమాలయ మంచుభారత్‌ నేపాల్‌ సహాయంచైనా నేపాల్‌ సహాయక చర్యలుదక్షిణాసియా వరదలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుదీప్ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?
సినిమాలు

సుదీప్ లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 5 వరకు రేషన్ బియ్యం
జనరల్

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 5 వరకు రేషన్ బియ్యం

కొండచరియలు, వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం
జనరల్

కొండచరియలు, వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...
జనరల్

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...
జనరల్

పొలంలోనూ పట్టుదల చూపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి...

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం
జనరల్

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!
జనరల్

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు
జనరల్

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..
జనరల్

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..

‘రొమాంచకం’ మూవీకి విషెస్ చెప్పిన ప్రభాస్
సినిమాలు

‘రొమాంచకం’ మూవీకి విషెస్ చెప్పిన ప్రభాస్

మహారాష్ట్రలో వందల కిలోమీటర్లు తిరుగుతున్న పులి...
జనరల్

మహారాష్ట్రలో వందల కిలోమీటర్లు తిరుగుతున్న పులి...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!