
జనరల్

ప్రతి ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్నానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీని సీఎంకు కట్టినట్లు చెప్పారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సీతక్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టినట్లు వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన అల్లుడు, మనవడికి కూడా రాఖీ కట్టినట్లు కొండా సురేఖ తెలిపారు. ప్రేమను పంచే పండుగ రాఖీ పండుగ అని పేర్కొంటూ అన్నదమ్ములందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదం ఆడపడుచులపై ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె అన్నారు. ప్రతి స్త్రీ జీవితంలో భర్త ఒక ముఖ్యమైన భాగస్వామి అని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!