

ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో యూపీఐ చెల్లింపులపై ప్రతిపాదించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)కు వ్యాపారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు మించిన కొన్ని పర్సన్-టు-మర్చంట్ యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో గాజియాబాద్లోని కొన్ని దుకాణాల ముందు ‘యూపీఐ చెల్లింపులు స్వీకరించబడవు’ అంటూ నోటీసులు ఏర్పాటు చేశారు.
ఎండీఆర్ భారాన్ని వ్యాపారులే భరించాల్సి ఉన్నప్పటికీ, అదనపు ఖర్చు తమ లాభాలపై ప్రభావం చూపుతుందని వ్యాపారులు చెబుతున్నారు. చివరికి ఈ భారాన్ని వస్తువుల ధరల రూపంలో వినియోగదారులపైకి బదిలీ చేయాల్సి రావచ్చని కొందరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఈ నిబంధనల వల్ల నగదు చెల్లింపుల వైపు తిరిగి వెళ్లే పరిస్థితి ఏర్పడొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే రూ.2,000 వరకు మర్చంట్ యూపీఐ చెల్లింపులు, వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే లావాదేవీలు ఈ ఎండీఆర్ పరిధిలో ఉండవు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!