
బిజినెస్

భారత అటవీ సర్వే గణాంకాల ప్రకారం అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి పీవీ చలపతిరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని రాష్ట్ర అటవీ అకాడమీలో మాట్లాడుతూ రాష్ట్ర భూభాగంలో ప్రస్తుతం 30 శాతం పచ్చదనం ఉందన్నారు. ఇందులో 23 శాతం అడవులు కాగా, మరో 7 శాతం చెట్ల రూపంలో ఉందని వివరించారు.
రాష్ట్రంలో పచ్చదనం మరింత పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. 2030 నాటికి పచ్చదనాన్ని 37 శాతానికి, 2047 నాటికి 50 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన తోటల పెంపకంతో పాటు 50 లక్షల తాటి టెంకలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు. అలాగే జూలైలో 2.5 కోట్ల విత్తన బంతులను డ్రోన్ల సహాయంతో వెదజల్లనున్నట్లు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!