

దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్ట్, వన్డే సిరీస్ల తర్వాత టీమ్ ఇండియా ఇప్పుడు టీ–20 ఫార్మాట్కు సిద్ధమవుతోంది. డిసెంబర్ 9 నుంచి 19 వరకు ఐదు మ్యాచ్ల టీ–20 సిరీస్ జరగనుండగా, ఈ సిరీస్ కోసం సెలక్టర్లు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. గాయాల కారణంగా క్రికెట్కు దూరమైన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్తో పునరాగమనం చేయనున్నాడు. టెస్ట్ సిరీస్లో గాయపడి వన్డేలకు దూరమైన గిల్ కూడా బీసీసీఐ క్లియరెన్స్ వచ్చాక టీ–20ల్లో ఆడనున్నాడు. ఇదే సమయంలో, ఫామ్ సమస్యతో బాధపడుతున్న రింకూ సింగ్పై వేటు పడింది. జట్టులో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబే వంటి యువ ప్రతిభకు మంచి అవకాశం కల్పించారు. బుమ్రా, అర్షదీప్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి వంటి కీలక బౌలర్లు జట్టులో ఉండటంతో ఈ సిరీస్ కఠినంగా ఉండనుంది. ఐదు మ్యాచ్ల షెడ్యూల్ కూడా విడుదలైంది:




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!