

2026 ఫిఫా ప్రపంచకప్ సందర్భంగా అర్జెంటీనాకు ఫిఫా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందన్న ఆరోపణలను కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఖండించారు. వరుసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్కు అర్జెంటీనాను చేర్చిన అనంతరం మాట్లాడిన మెస్సీ, గత నాలుగేళ్లుగా తమ జట్టే ప్రపంచంలో అత్యుత్తమ జట్టుగా నిలుస్తోందని అన్నారు. విమర్శలు చేసినా, ఎవరు ఏమన్నా తమ విజయాలు మైదానంలో చేసిన ప్రదర్శన ఫలితమేనని, ఎవరూ తమకు విజయాలను బహుమతిగా ఇవ్వలేదని స్పష్టం చేశారు.
ఇంగ్లాండ్పై గెలుపు అనంతరం విమర్శకులకు కూడా మెస్సీ గట్టి సమాధానం ఇచ్చారు. ఫుట్బాల్ పరంగా తమ జట్టే మెరుగైనదని, అందుకే విజయాన్ని సాధించామని పేర్కొన్నారు. అలాగే ఈ విజయాన్ని అర్జెంటీనా దిగ్గజం డియెగో మారడోనాకు అంకితం చేస్తూ, ఆయన పై నుంచి ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఫైనల్లో స్పెయిన్తో తలపడనున్న నేపథ్యంలో అర్జెంటీనా ప్రయాణం ప్రతిభ, కృషితో సాగిందని మెస్సీ మరోసారి స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!