
జనరల్

కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడకు మరోసారి రాజ్యసభ అవకాశం లభిస్తుందని జేడీఎస్ ఆశించినప్పటికీ, బీజేపీ తన అభ్యర్థిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. నాగరాజును ప్రకటించింది. దీంతో ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ అయిన జేడీఎస్కు ఎదురుదెబ్బ తగిలిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. జేడీఎస్, దేవెగౌడ మద్దతును ఉపయోగించుకున్న బీజేపీ చివరకు ఆయనకు రాజ్యసభ టికెట్ నిరాకరించిందని కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా ఆరోపించారు. జూన్ 18న కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్ మూడు స్థానాలు, బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!