
సినిమాలు

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, అదే పార్టీకి చెందిన ఎంపీ మరియు మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్పై బహిరంగంగా విమర్శలు గుప్పించారు. యూసఫ్ పఠాన్ ఢిల్లీ పర్యటన వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపు ఉందా అనే సందేహాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో ధైర్యం, నిబద్ధత చూపించాలని సూచిస్తూ, బహరాంపూర్ ప్రజలు ఆయనను భారీ మెజారిటీతో ఎన్నుకున్నారని గుర్తుచేశారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధురిని ఓడించిన యూసఫ్ పఠాన్ ఇటీవల పార్టీ భవిష్యత్తు పాత్రపై ఊహాగానాల మధ్య ఉన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై యూసఫ్ పఠాన్ గానీ, టీఎంసీ నాయకత్వం గానీ ఇప్పటివరకు స్పందించలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!