
బిజినెస్

తెలంగాణ ఇంటర్ మీడియట్ బోర్డు ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై ఫస్టియర్ నుంచే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్ నిర్వహించనుంది. ప్రతి ఏడాది 15 మార్కులు ప్రాక్టికల్స్కు కేటాయించనున్నారు. దీని ద్వారా విద్యార్థులు ప్రారంభం నుంచే టెక్నికల్ నాలెడ్జ్ పొందే అవకాశం కలుగుతుంది.
మ్యాథ్స్తో పాటు భాషా సబ్జెక్టుల్లో కూడా మార్పులు చేశారు. మ్యాథ్స్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ విధానం అమలు చేసి 15 మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్గా కేటాయిస్తారు. దీంతో ఫైనల్ ఎగ్జామ్ 75 మార్కుల నుంచి 60కి తగ్గుతుంది. మొత్తం పేపర్ విధానాన్ని 100 మార్కుల నుంచి 80 మార్కులకు మార్చి, మిగతా 20 మార్కులను ఇంటర్నల్కు కేటాయించనున్నారు. బట్టీ విధానాన్ని తగ్గించి ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచడమే లక్ష్యమని బోర్డు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!