
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. జూన్ 10న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో వారు పాల్గొననున్నారు. పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర-రాష్ట్రాల సమన్వయం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగే అవకాశం ఉంది.
జూన్ 9తో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. అలాగే జూన్ 15 తర్వాత కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం మరింత ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!