
జనరల్

గేయ రచయిత అనంత శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో భూ వివాదంపై ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం దొడ్జిపట్ల గ్రామంలో ఉన్న 5 సెంట్ల ఉమ్మడి భూమిని ఆక్రమించారని ఆయన పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఇచ్చిన వినతిపత్రంలో హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ భూ వివాదం కోర్టులో పెండింగ్లో ఉందని తెలిపి తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!