

అఖండ 2: తాండవం అంచనాలను మించి ఉంటుందని, గూస్బంప్స్ మూమెంట్స్తో నిండి ఉంటుందని నిర్మాతలు రామ్ అచంట, గోపీ అచంట ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన వీరిద్దరూ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ - బ్లాక్బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ ఓ డివైన్ యాక్షన్ భారీ ప్రదర్శన సృష్టించిందని, థియేటర్లో తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా అని అన్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో, ఎస్ థమన్ సంగీతంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5, 2025 న 2D, 3D ఫార్మాట్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. అనుమతులు రాగానే డిసెంబర్ 4 సాయంత్రం 8-9 గంటల నుంచి ప్రీమియర్స్ ఉండొచ్చని తెలిపారు.
కుంభమేళాలోనే అసలు షూటింగ్ జరిపామని, డ్రోన్ పర్మిషన్లతో సహా అన్నీ అనుమతులు తీసుకుని స్టాక్ షాట్స్ లేకుండా చిత్రీకరించామని నిర్మాతలు వెల్లడించారు. కాశ్మీర్ అనుమతులు రాకపోవడంతో క్లైమాక్స్ను జార్జియాలో మైనస్ డిగ్రీల చలిలో షూట్ చేశామని, స్లీవ్లెస్ అఘోర గెటప్లో బాలకృష్ణ అద్భుతంగా నటించారని కొనియాడారు. సనాతన ధర్మం, భక్తి, నమ్మకం చుట్టూ తిరిగే కథ అని, త్రిశూలం యాక్షన్ ఇంతకు ముందు ఎవరూ చూడలేదని చెప్పారు. అన్ని సౌత్ భాషలు, హిందీతో పాటు బీహార్లో మాట్లాడే అవధి భాషలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

.png&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!