

కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఈ శుక్రవారం గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. మమితా బైజు హీరోయిన్గా నటించిన ఈ సినిమా తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ వెంకీ అట్లూరితో కలిసి పనిచేయాలనే తన ఆసక్తిని వెల్లడించారు. ‘లక్కీ భాస్కర్’ తర్వాత వెంకీ ఏ కథ చెప్పినా తాను అంగీకరించేవాడినని, ఆయనతో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని తెలిపారు.
అయితే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కంటే ముందే వెంకీ అట్లూరి తనను ఓ బయోపిక్ కథతో సంప్రదించారని సూర్య వెల్లడించారు. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని తెలిపారు. దీంతో సూర్యతో వెంకీ ఏ మహనీయుడి బయోపిక్ తెరకెక్కించాలనుకున్నారనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. తన గత రెండు సినిమాలు పిరియాడిక్ నేపథ్యంతో తెరకెక్కిన నేపథ్యంలో మరోసారి అదే తరహా కథ చేస్తే రొటీన్గా మారే అవకాశం ఉందని వెంకీ భావించినట్లు తెలుస్తోంది. మరోవైపు సూర్య కూడా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనే ఆసక్తితో ఉండటంతో వీరిద్దరి కాంబినేషన్లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రూపుదిద్దుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!